ప్రొద్దుటూరులో అనుమానాస్పద మృతి కలకలం

మూడు రోజులుగా మంచంపైనే మహిళ మృతదేహం… ఇంట్లో ఏమి జరిగింది? ఎవరికీ తెలియకుండా రోజులు ఎలా గడిచాయి? ప్రొద్దుటూరు బంగారయ్య కొట్టాలలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కలవరపెడుతోంది. సుసన్ రాణి (44) అనే మహిళ తన ఇంట్లో మంచంపై విగతజీవిగా కనిపించగా, ఆమె మరణించి ఇప్పటికే మూడు రోజులు దాటినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చిందా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది సహజ మరణమా? ఆత్మహత్యా? లేక మరేదైనా అనుమానాస్పద ఘటన వెనుక ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు ఆధారాలు సేకరిస్తుండగా, పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

మంచంపై విగతజీవిగా మహిళ.. మిస్టరీగా మారిన మృతి