అమరావతి: రాయలసీమ మార్కెట్లకు భారీగా 12,215 మెట్రిక్ టన్నుల టమాటా వచ్చినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రవి పట్టన్ శెట్టి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాణ్యత ఆధారంగా మార్కెట్లలో 5,564 మెట్రిక్ టన్నుల ఫస్ట్ గ్రేడ్, 6,650 మెట్రిక్ టన్నుల సెకండ్ గ్రేడ్ టమాటా లభిస్తున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన టమాటా రాకతో కొన్ని మార్కెట్లలో స్వల్పంగా ధరలు పెరిగాయి. అధిక ఉత్పత్తి, భారీ రాకలతో కొన్ని మార్కెట్లలో స్వల్పంగా ధరలు తగ్గాయి.
అకాల వాతావరణ మార్పుల కారణంగా టమాటా క్వాలిటీ దెబ్బతింది. సీజన్ ముగింపు దశకు చేరింది. మార్కెట్కు నల్ల మచ్చలతో కూడిన టమాటా వచ్చింది. దెబ్బతిన్న, క్వాలిటీ తగ్గిన టమాటాలకు అధిక ధర ఇచ్చేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడంలేదు. ములకలచెరువులో టమాటా మార్కెటింగ్ సీజన్ పీక్ స్టేజ్కు చేరుకుంది. డిమాండ్, సప్లై ఆధారంగానే ధరల నిర్ణయం అవుతున్నాయి. కలికిరి మార్కెట్లో గత వారంతో పోలిస్తే మెరుగైన ధరలు లభిస్తున్నాయి.
రాప్తాడు ప్రైవేట్ మార్కెట్కు రికార్డు స్థాయిలో 6,750 మెట్రిక్ టన్నుల టమాటా వచ్చింది. పట్టికొండ, పీపుల్లి మార్కెట్లకు శుక్రవారం టమాటా రాలేదు. టమాటాను సరిగ్గా గ్రేడింగ్ చేసి మార్కెట్కు తెస్తేనే మెరుగైన ధర లభించే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రైతులకు సూచించారు. మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
#Rayalaseema #TomatoMarket #TomatoPrices #AndhraPradesh #TomatoArrivals #Agriculture #Farmers #Horticulture #Rapthadu #Mulakalacheruvu #Kalikiri #MarketUpdate #TomatoGrading #APNews #AgricultureNews











