ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే!
విద్యార్థి ఉద్యమం.. ప్రభుత్వంపై ఒత్తిడి.
నిరుద్యోగుల సమస్యలపై వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గత 74 రోజులుగా పార్టీ ఆధ్వర్యంలో వివిధ దశల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపారు. మే 29న విద్యార్థి విభాగం నిరసనలతో ప్రారంభమైన కార్యక్రమాలు.. కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు, టౌన్హాల్ సమావేశాలు, 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు, గవర్నర్కు వినతిపత్రం, రిలే నిరాహార దీక్షల వరకు సాగాయని వివరించారు.
డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు డిమాండ్
డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. విద్యాదీవెన, వసతిదీవెన కింద దాదాపు రూ.9 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి రూ.1.08 లక్షల బకాయి వస్తుందని జగన్ పేర్కొన్నారు. ప్రజలు ఇంత స్పష్టంగా డిమాండ్లు చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్పందించకుండా మౌనం వహిస్తున్నారని విమర్శించారు.
పోలీసు నిర్బంధాలతో ఉద్యమం ఆగదు
ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని జగన్ అన్నారు. నిరసనలకు అనుమతులు నిరాకరించడం, నోటీసులు ఇవ్వడం, పోలీసు బలంతో అడ్డుకోవడం సమస్యకు పరిష్కారం కాదని విమర్శించారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, నిరుద్యోగులు, తమ పిల్లల చదువుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి డిమాండ్లను అంగీకరిస్తారా, లేక తన కుమారుడిని కాపాడుకునేందుకు మౌనం కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. జెన్ జెడ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని జగన్ స్పష్టం చేశారు
#YSJagan #DSCProtest #DSCIrregularities #YSRCP #NaraLokesh #CBIProbe #DSCRecruitment #StudentProtest #Unemployment #AndhraPradeshPolitics #ChandrababuNaidu #APNews #YouthProtest











