గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ తొమ్మిదో రోజు భారత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. జూడోలో అస్మితా డే స్వర్ణ పతకం సాధించి కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో జూడో విభాగంలో భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించింది. మరో జూడోకా హర్ష్ సింగ్ కూడా స్వర్ణం గెలిచి భారత్ ఖాతాలో మరో బంగారు పతకాన్ని జమ చేశాడు. అథ్లెటిక్స్లో తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్లో కాంస్య పతకం సాధించి ఈ విభాగంలో కామన్వెల్త్ గేమ్స్లో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు.
బాక్సింగ్లో 10 పతకాలు
భారత బాక్సర్లు సెమీఫైనల్స్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రీతి పవార్, అంకుష్ పంఘాల్, జైస్మిన్ లాంబోరియా, జాదుమణి సింగ్, అరుంధతి చౌదరి, సాక్షి చౌదరి, ప్రియా ఘంగాస్, లవ్లీనా బోర్గొహైన్, సచిన్ సివాచ్, నరేందర్ బెర్వాల్ ఫైనల్స్కు అర్హత సాధించారు. దీంతో భారత్కు బాక్సింగ్లో కనీసం 10 పతకాలు ఖాయమయ్యాయి. ఇప్పటివరకు భారత్ 5 స్వర్ణాలు, 11 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం 21 పతకాలు సాధించింది.
#CommonwealthGames2026 #IndiaAtCWG #TeamIndia #IndianAthletes #Judo #AsmitaDey #HarshSingh #TejaswinShankar #Boxing #LovlinaBorgohain #PreetiPawar #JasmineLamboria #IndianBoxing #IndianAthletics #Glasgow2026 #IndiaMedals #CommonwealthGames











