ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఇంజినీరింగ్ విద్యార్థులను “క్రిమినల్ వేస్ట్” అంటూ అవమానించడం సరికాదని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో లక్షలాది మంది విద్యార్థులతో పాటు వారికి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను కూడా సీఎం అవమానించినట్లేనని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రతిభ చాటుతూ దేశానికి, రాష్ట్రానికి గుర్తింపు తీసుకొస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. అలాంటి విద్యార్థులను అవమానించేలా మాట్లాడటం బాధాకరమని విమర్శించారు. సీఎం ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.
#HarishRao #RevanthReddy #EngineeringStudents #EngineeringEducation #Telangana #TelanganaPolitics #BRS #BRSParty #RevanthReddyRemarks #HarishRaoResponse #StudentIssues #StudentWelfare #EngineeringGraduates #EducationNews #PoliticalControversy #TelanganaNews #TelanganaPolitics #BRSvsCongress #Congress #KCR











