15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. ముంబైలో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. వైభవ్ ఒక్క సిరీస్ లేదా ఒక్క ఏడాది మెరుపుగా మిగలకుండా, సచిన్ టెండూల్కర్లా సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. అతడికి సరైన మార్గదర్శకత్వం, మద్దతు అందించేందుకు ప్రతి దశను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇటీవల దులీప్ ట్రోఫీలో 15 ఏళ్ల 157 రోజుల వయసులో అత్యంత పిన్న వయస్కుడిగా అర్ధశతకం సాధించిన వైభవ్, జింబాబ్వేపై మూడు మ్యాచ్ల్లో 151 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇంగ్లాండ్తో టీ20ల్లో భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు, 237.30 స్ట్రైక్రేట్తో అదరగొట్టి ఆరెంజ్ క్యాప్తో పాటు పలు అవార్డులు అందుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్లో 439 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన వైభవ్ భవిష్యత్తుపై బీసీసీఐ భారీ అంచనాలు పెట్టుకుంది.
#VaibhavSuryavanshi #BCCI #SachinTendulkar #IndianCricket #VaibhavSuryavanshiCareer #BCCIPlan #TeenageCricketer #RajasthanRoyals #IPL2026 #IndiaCricket #DevajitSaikia #CricketNews











