సమావేశానికి దూరమైన చీఫ్ సెలెక్టర్.
భారత క్రికెట్లో కీలక పరిణామాలు, అజిత్ అగార్కర్ పదవీకాలంపై ఊహాగానాల మధ్య బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. గురువారం జరిగిన కీలక సమావేశానికి కెప్టెన్లు శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ ఉన్నతాధికారులు, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ హాజరయ్యారు. అయితే చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ప్రత్యక్షంగా, ఆన్లైన్లోనూ పాల్గొనలేదు. దీంతో ఆయన పదవీకాలంపై రూమర్లు మొదలయ్యాయి. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వాటిని కొట్టిపారేశారు. అగార్కర్ నగరంలో లేరని, సమావేశం తక్కువ వ్యవధిలో ఖరారైందని, ఆన్లైన్లో పాల్గొనలేని ప్రాంతంలో ఉన్నారని చెప్పారు. ఆయన పదవీకాలం పొడిగింపుపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. లక్ష్మణ్ను బీసీసీఐ క్రికెట్ డైరెక్టర్గా నియమిస్తారన్న ప్రచారాన్ని కూడా ఖండించారు. ఇదిలా ఉంటే అగార్కర్ తన పదవిలో సూర్యకుమార్ యాదవ్ను టీ20 కెప్టెన్గా కొనసాగించడం, రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం వంటి కీలక నిర్ణయాలకు బాధ్యత వహించారు. విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిర్ణయాలను సమర్థించారు. ప్రజాదరణ కంటే స్పష్టత, ధైర్యం, జట్టు అవసరాలే సెలెక్టర్కు ముఖ్యమని ఆయన వ్యవహారశైలి చాటింది.
#AjitAgarkar #BCCI #ChiefSelector #BCCIChiefSelector #IndianCricket #BCCIUpdates #DevajitSaikia #VVSLaxman #GautamGambhir #ShubmanGill #ShreyasIyer #SuryakumarYadav #RohitSharma #TeamIndia











