Home General ఇంకా రెండు డిమాండ్లున్నాయ్.. అవి పరిష్కారమైతనే.. తేల్చి చెప్పిన కాక్రోచ్‍‌లు

ఇంకా రెండు డిమాండ్లున్నాయ్.. అవి పరిష్కారమైతనే.. తేల్చి చెప్పిన కాక్రోచ్‍‌లు

Dharmendra Pradhan Resignation Demands

రాజీనామా చేసినా తగ్గిని వేడి.. పోరాటం ఇంకా ముగియలేదన్న కాక్రోచ్‌లు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల లీకేజీలు, విద్యావ్యవస్థలోని లోపాలపై గత కొద్దివారాలుగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఆందోళనల ఒత్తిడి తట్టుకోలేక ఆయన శనివారం మధ్యాహ్నం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ తమ నిరసనలు ఆపేది లేదని కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షులు అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు. తమ ముందుకు మరో రెండు ప్రధాన డిమాండ్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటన చేశారు.

నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రధాన డిమాండ్
నీట్ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాల కారణంగా మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని దిప్కే డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఒక కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని కోరారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని హెచ్చరిక
జూలై ఇరవైవ తేదీన పార్లమెంటు వైపు శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. గూండాల లాగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ రోజు నుంచి విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.