గురుభక్తులకు ప్రత్యేక సందేశం
ఈ నెల 29న జరగనున్న గురుపౌర్ణమి సందర్భంగా జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులు, మఠం శిష్యులకు మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీరధర్మజ వేంకటాద్రి స్వామి ప్రత్యేక మార్గదర్శనం చేశారు. గురుపౌర్ణమి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని, గురువుల ఆశీస్సులు పొందేందుకు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. గురుభక్తి, ధర్మాచరణ, ఆధ్యాత్మిక సాధనతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలని స్వామివారు సందేశమిచ్చారు.
కందిమల్లయపల్లిలో మహోత్సవాలు
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని శ్రీ బ్రహ్మంగారి మఠం మండల పరిధిలో ఉన్న జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం, శ్రీ వీరబ్రహ్మ క్షేత్రం కందిమల్లయపల్లిలో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, గురుపాదుకా సేవ, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని మఠం నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.











