Home AP ‘తల్లికి వందనం’పై తీవ్ర విమర్శలు.. ప్రభుత్వాన్ని నిలదీసిన రాచమల్లు

‘తల్లికి వందనం’పై తీవ్ర విమర్శలు.. ప్రభుత్వాన్ని నిలదీసిన రాచమల్లు

Talliki Vandanam Scheme Criticism

తల్లికి వందనంపై రాచమల్లు ఫైర్,  నాలుగు మోసాల ఆరోపణ
పథకంపై ఘాటు విమర్శలు
ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ పథకం పేరుతో తల్లులను నాలుగు రకాలుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ‘తల్లికి వందనం’ అమలు చేస్తామని ప్రకటించినా, తొలి ఏడాదిలో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయలేదని రాచమల్లు విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది విద్యార్థులు ఉండగా, కేవలం 60 లక్షల మందికే లబ్ధి అందిందని, మరో 20 లక్షల మంది అర్హులు పథకానికి దూరమయ్యారని ఆరోపించారు.

సాయం తగ్గించారన్న విమర్శ
ఎన్నికల సమయంలో ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ప్రకటించి, ప్రస్తుతం రూ.13 వేలకే పరిమితం చేశారని రాచమల్లు అన్నారు. అదీ అందరికీ ఒకే విధంగా కాకుండా రూ.5 వేలు, రూ.7 వేలు, రూ.10 వేలు, రూ.13 వేలుగా వేర్వేరు మొత్తాలు జమ చేశారని విమర్శించారు. ఇది హామీలకు విరుద్ధమని పేర్కొన్నారు. గత ఏడాది లబ్ధి పొందని తల్లులు ఈ ఏడాది కూడా నిరాశ చెందారని రాచమల్లు తెలిపారు. ‘తల్లికి వందనం’ నిధులను కూడా సకాలంలో విడుదల చేయడంలో ప్రభుత్వం  విఫలమైందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ‘అమ్మఒడి’ పథకం కింద నిర్ణీత సమయంలోనే నిధులు విడుదలయ్యేవని గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.
మహేష్ పోసా
ప్రొద్దుటూరు
+917337378783