తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ చేపట్టిన పోరాటంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష ముగిసింది. దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’ పేరుతో ఈ దీక్ష కొనసాగింది. విద్యార్థుల చదువులకు ఇబ్బందులు రాకుండా వెంటనే బకాయిలు విడుదల చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రాంచందర్రావు చేపట్టిన దీక్షను రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విద్యార్థులతో కలిసి నిమ్మరసం అందించి విరమింపజేశారు. ఫీజు బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు విద్యార్థుల తరఫున పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు.
#TelanganaFeeReimbursement #FeeReimbursementDues #BJPTelangana #NRamchanderRao #BJPProtest #TelanganaStudents #StudentFeeDues #FeeDues #TelanganaEducation #CongressGovernment #TelanganaPolitics #BJPHungerStrike #KLaxman #MaheshwarReddy #StudentWelfare #TelanganaNews #BJP #EducationCrisis #StudentProtest #TelanganaGovernment











