సీఎం రేవంత్ విమర్శలపై సుస్మిత వివరణ .
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ స్పష్టత ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో మంత్రి కొండా సురేఖకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉండొచ్చని తెలిపారు. తన వ్యాఖ్యలను తల్లి రాజకీయ వైఖరితో ముడిపెట్టడం సరికాదన్న సంకేతం ఇచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై తనకు పూర్తి నమ్మకం ఉందని సుస్మిత పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. తాజా వివరణతో రేవంత్రెడ్డిపై చేసిన వ్యాఖ్యల ప్రభావాన్ని తల్లి కొండా సురేఖకు దూరంగా ఉంచే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుస్మిత తాజా ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
#SusmithaPatel #KondaSurekha #RevanthReddy #TelanganaCongress #Congress #TelanganaPolitics #CongressCrisis #PoliticalNews #TelanganaNews #KondaFamily











