లోక్సభ సీట్ల పెంపు వద్దంటే వద్దు
కేంద్రాన్ని డిమాండ్ చేసిన సీడబ్ల్యూసీ
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ మరోసారి స్పష్టమైన వైఖరి ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను యథాతథంగా కొనసాగించాలని, వాటిలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. సీట్ల పునర్విభజన పేరుతో రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంలో మార్పులు రావద్దన్నది కాంగ్రెస్ అభిప్రాయంగా కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల పోరాటం ఫలించిందని పేర్కొన్నారు. నీట్ వ్యవహారం, రామమందిర విరాళాల్లో అక్రమాల ఆరోపణలపై దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. అరుణాచల్ప్రదేశ్లో చైనా ఆక్రమణలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది.
యువతలోకి రాహుల్ కార్యక్రమం
కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపైనా కాంగ్రెస్ విమర్శలు చేసింది. అనేక అంశాల్లో కేంద్రం విఫలమైందని ఆరోపించింది. విద్యార్థులు, యువత సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘ఛాత్రోంకి గూంజ్’ కార్యక్రమాన్ని మరింత విస్తరించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సుమారు 800 నగరాలు, పట్టణాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కొన్ని ప్రాంతాల్లో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణలో యువత, విద్యార్థుల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను పెంచాలని కాంగ్రెస్ భావిస్తోంది.
#Congress #CWC #LokSabha #LokSabhaSeats #543Seats #WomenReservation #33PercentReservation #Delimitation #LokSabhaDelimitation #RahulGandhi #CongressCWC #IndianPolitics #ParliamentNews #PoliticalNews #CongressNews #ChhatronKiGoonj #IndiaPolitics











