శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయంతో సాయ్ సుదర్శన్ సిరీస్కు దూరం కావడంతో అతడి స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను బీసీసీఐ ఎంపిక చేసింది. కుడి కాలివేలిలో స్ట్రెస్ రియాక్షన్ కారణంగా సాయ్ సుదర్శన్ చికిత్స తీసుకుంటున్నారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోలుకుంటున్న అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం కోలుకునే ప్రక్రియలో గణనీయమైన పురోగతి కనిపించినప్పటికీ, శ్రీలంక సిరీస్కు పూర్తిగా అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో సెలెక్టర్లు సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేశారు. భారత్ తరఫున సర్ఫరాజ్ చివరిసారిగా 2024 నవంబర్లో ఆడాడు. శ్రీలంక పర్యటనలో భారత జట్టుతో కలిసి కొలంబో చేరనున్న సర్ఫరాజ్, అక్కడి నుంచి గాలేకు వెళ్లనున్నాడు. ఆగస్టు 15 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుండటంతో సర్ఫరాజ్కు మరోసారి తన సత్తా నిరూపించుకునే అవకాశం లభించింది.
#SarfarazKhan #SaiSudharsan #INDvsSL #IndiaVsSriLanka #SriLankaTests #TestCricket #IndianCricket #TeamIndia #BCCI #SarfarazKhanComeback #SaiSudharsanInjury #IndiaTestSquad #CricketNews #GalleTest #SriLankaTestSeries











