పారా అథ్లెట్ల ఘనతకు హోంమంత్రి అభినందనలు
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత పారా అథ్లెట్లు దిలీప్ మహడు గవిట్, మహ్మద్ బాసిల్ మోర్సింగ్నకతి చరిత్ర సృష్టించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. పురుషుల టీ47 100 మీటర్ల విభాగంలో గవిట్ 10.71 సెకన్ల గేమ్స్ రికార్డుతో స్వర్ణం గెలవగా, బాసిల్ 10.83 సెకన్లతో రజతం సాధించి భారత్కు చారిత్రాత్మక 1-2 స్థానాలు అందించారు. ఈ విజయాన్ని “భారత్కు డబుల్ విక్టరీ”గా అభివర్ణించిన అమిత్ షా, వారి వేగం, పట్టుదల దేశ ప్రజల్లో గర్వాన్ని నింపాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అలాగే పురుషుల లాంగ్ జంప్లో 8.09 మీటర్ల ఉత్తమ ప్రయత్నంతో వరుసగా రెండో కామన్వెల్త్ రజత పతకం సాధించిన మురళీ శ్రీశంకర్ను కూడా ఆయన అభినందించారు. బర్మింగ్హామ్-2022లోనూ రజతం గెలిచిన శ్రీశంకర్ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడని ప్రశంసించారు. భారత అథ్లెటిక్స్కు ఈ విజయాలు మరింత గౌరవాన్ని తీసుకొచ్చాయని అమిత్ షా పేర్కొన్నారు.
#AmitShah #CommonwealthGames2026 #CommonwealthGames #GlasgowCommonwealthGames #India #ParaAthletics #ParaAthletes #DilipMahaduGavit #MohammedBasil #T47100m #GoldMedal #SilverMedal #DoubleVictory #GamesRecord #MuraliSreeshankar #LongJump #IndianAthletics #IndianSports #TeamIndia #SportsNews #CommonwealthGamesIndia #Birmingham2022











