Home AP జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలి ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ ఫైర్‌

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలి ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ ఫైర్‌



జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌కు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కోర్టులు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. జగన్‌పై అక్రమాస్తుల కేసుతో పాటు పలు కేసులు ఉన్నాయని, ఇప్పటికే ఆయన 16 నెలలు జైలు జీవితం గడిపి బెయిల్‌పై బయట ఉన్నారని జ్యోతుల గుర్తుచేశారు. సుదీర్ఘకాలంగా బెయిల్‌పై కొనసాగుతున్న జగన్‌ వ్యవహారంపై న్యాయస్థానాలు దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. అలాంటి పరిస్థితుల్లో జగన్‌ బెయిల్‌ ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించారు.

పరామర్శల పేరుతో రెచ్చగొడుతున్నారా?

జగన్‌ పరామర్శల పేరుతో ప్రజలను సమీకరించి ఆందోళనలకు కారణమవుతున్నారని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. పరామర్శలను రాజకీయ కార్యక్రమాలుగా మార్చి జనాలను రెచ్చగొట్టడం, గొడవలకు దారితీసే పరిస్థితులు సృష్టించడం సరికాదని అన్నారు. జగన్‌ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించడం పేరుతో భారీగా జనాలను పోగేసి ఉద్రిక్తతలు పెంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే న్యాయపరమైన చర్యలు తప్పవని అన్నారు. జగన్‌ బెయిల్‌ అంశంపై సుప్రీంకోర్టు స్వయంగా దృష్టి సారించి తగిన నిర్ణయం తీసుకోవాలని జ్యోతుల నెహ్రూ కోరారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎలా స్పందిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

 

#JyothulaNehru #JaganMohanReddy #YSJagan #JaganBail #BailCancellation #SupremeCourt #TDP #YSRCP #AndhraPradeshPolitics #APPolitics #TDPvsYSRCP #JaganCases #IllegalAssetsCase #AndhraPradeshNews #PoliticalNews #Jaggampeta #JyothulaNehruNews #APNews #JaganControversy #TDPNews