Home Sports_News శ్రీలంక సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాకు షాక్

శ్రీలంక సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాకు షాక్



శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాకు కీలక ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో సిరీస్‌కు దూరమైనట్లు సమాచారం. శ్రీలంక ‘ఏ’తో జరిగిన రెండో మ్యాచ్‌లో కాలికి గాయం కావడంతో అప్పటి నుంచి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. వైద్య బృందం మరింత సమయం అవసరమని సూచించడంతో అతడిని టెస్టులకు ఎంపిక చేయడం లేదని తెలుస్తోంది. సుదర్శన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సర్ఫరాజ్ ఖాన్, షేక్ రషీద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సర్ఫరాజ్ ఇప్పటికే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు 21 ఏళ్ల షేక్ రషీద్‌ను కూడా అక్కడికి రావాలని సూచించినట్లు సమాచారం. శ్రీలంకలో భారత్‌ ‘ఏ’ తరఫున రెండు రెడ్‌బాల్ మ్యాచ్‌ల్లో రషీద్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇదే అతడికి జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశాలను పెంచుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన దేవదత్త్ పడిక్కల్ సాయి సుదర్శన్ స్థానంలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

 

#SaiSudharsan #IndiaVsSriLanka #SriLankaTestSeries #TeamIndia #IndiaTestTeam #SaiSudharsanInjury #SarfarazKhan #ShaikhRasheed #DevduttPadikkal #BCCI #BCCCCentreOfExcellence #IndiaCricket #TestCricket #SriLankaCricket #CricketNews